Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు.. మృతి.. నెటిజన్ల ఫైర్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (22:19 IST)
కేరళలో కరెంట్ షాక్‌తో ఏనుగులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులోని నీలగిరి అటవీ ప్రాంత గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఏనుగుకు కొందరు నిప్పుపెట్టడంతో కాలిన గాయాలతో మరణించింది. ఏనుగుకు నిప్పుపెట్టిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది. ఈ దారుణాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. నీలగిరి, మాసినగుడి గ్రామంలోకి 40 ఏండ్ల అడవి ఏనుగు ఇటీవల ప్రవేశించింది. దీంతో దానిని తరిమేందుకు కొందరు గ్రామస్తులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరారు. అయితే అది ఏనుగు చెవులకు చిక్కుకుంది. కాలుతున్న టైర్‌ మంటలకు తాళలేక అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది.
 
కాగా, తల వెనుక, చెవుల వద్ద తీవ్రంగా కాలిన గాయాలతో పడి ఉన్న ఆ ఏనుగును అటవీ సిబ్బంది గమనించారు. తెప్పకాడు ఏనుగు శిబిరానికి తీసుకెళ్లి చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ఏనుగు ఈ నెల 19న చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగుకు నిప్పుపెట్టిన ముగ్గురిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇద్దరిని అరెస్ట్‌ చేయగా మరొక వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments