Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100ల నోట్లు రద్దు.. పాత నోట్లకు మంగళం పాడనున్న ఆర్బీఐ?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (22:13 IST)
2016లో పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కేంద్రం రూ.2 వేలు, రూ.200 నోట్లను విడుదల చేసింది. 2019లో కేంద్రీయ బ్యాంకు రూ.100 నోట్లను సరికొత్త రంగులో ముద్రించినప్పటికీ.. పాత నోట్లు ఇప్పటికీ సర్కులేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రూ.100 రూ.10, రూ.5 సహా పాత నోట్లకు మార్చి లేదా ఏప్రిల్ నెల నుంచి ఆర్బీఐ మంగళం పాడనున్నట్టు తెలుస్తోంది. 
 
ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి. మీనా ఇవాళ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాత నోట్లను సర్కులేషన్ నుంచి ఉపసంహరించుకోనున్నట్టు వెల్లడించారు. జిల్లా పంచాయత్‌లోని నేత్రావతి హాల్‌లో డిస్ట్రిక్ లీడ్ బ్యాంకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలు కాయిన్లను అంగీకరించేందుకు సిద్ధంగా లేరనీ.. రూ.10 కాయిన్లను విడుదల చేసి 15 ఏళ్లు కావస్తున్న ఇప్పటికీ అవి చలామణిలోకి రావడం లేదని మీనా గుర్తు చేశారు. 
 
రూ.10 కాయిన్లు బ్యాంకుల్లోనే పేరుకుపోవడంతో ఆర్బీఐకి పెద్ద సమస్యగా మారిందన్నారు. రూ. 10 కాయిన్లను ప్రమోట్ చేయడానికి బ్యాంకులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సూచించారు. కాయిన్ల చెల్లుబాటుపై ప్రచారంలో ఉన్న పుకార్లకు చెక్ పెట్టేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments