Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధ్యప్రదేశ్‌లో మార్చి 31వరకు పాఠశాలలు బంద్

మధ్యప్రదేశ్‌లో మార్చి 31వరకు పాఠశాలలు బంద్
, శనివారం, 5 డిశెంబరు 2020 (11:46 IST)
దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదు అవుతోంది. కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో 8వ తరగతి వరకూ స్కూళ్లను మార్చి 31 వరకూ తెరవకూడదని నిర్ణయించింది. దీనికితోడు ఈ ఏడాది ఐదవ తరగతి, ఎనిమిదవ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
అలాగే 9వ తరగతి నుంచి 12 వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన విద్యాశాఖాధికారుల సమావేశంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో తగ్గని కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య