Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా ఉత్కంఠకు తెర : శివసేనకు జై కొట్టిన కాంగ్రెస్

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (19:23 IST)
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందుకున్న శివసేన పార్టీకి కాంగ్రెస్ అనూహ్యంగా మద్దతు ఇచ్చింది. 
 
ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారు. కొద్ది సేపటి క్రితం ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో భేటీ అయ్యి సేనకు మద్దతుపై లోతుగా చర్చించారు. 
 
చివరకు ప్రభుత్వానికి బయటనుంచి మద్దతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సోనియా గాంధీ పేరుతో అధికారిక లేఖను విడుదల చేశారు.
 
మరోవైపు, శివసేన ఇప్పటికే ఎన్‌సీపీ మద్దతు ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఈ మూడు పార్టీల సంఖ్యా బలం మ్యాజిక్ నెంబర్‌ను దాటుతుండటంతో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments