Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా ఉత్కంఠకు తెర : శివసేనకు జై కొట్టిన కాంగ్రెస్

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (19:23 IST)
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందుకున్న శివసేన పార్టీకి కాంగ్రెస్ అనూహ్యంగా మద్దతు ఇచ్చింది. 
 
ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారు. కొద్ది సేపటి క్రితం ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో భేటీ అయ్యి సేనకు మద్దతుపై లోతుగా చర్చించారు. 
 
చివరకు ప్రభుత్వానికి బయటనుంచి మద్దతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సోనియా గాంధీ పేరుతో అధికారిక లేఖను విడుదల చేశారు.
 
మరోవైపు, శివసేన ఇప్పటికే ఎన్‌సీపీ మద్దతు ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఈ మూడు పార్టీల సంఖ్యా బలం మ్యాజిక్ నెంబర్‌ను దాటుతుండటంతో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments