Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Shirdi ఆలయం మూసివేత.. ప్రాముఖ్యం తగ్గిపోతుంది ప్లీజ్..ఆపండి.. (video)

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (11:53 IST)
మహారాష్ట్రలో షిరిడీ సాయి జన్మభూమిపై సరికొత్త వివాదం నడుస్తోంది. సద్గురు సాయిబాబా జన్మస్థలంలో 1999లో అక్కడ శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరానికి కూడా భక్తులు పెద్ద మొత్తంలో ఆలయానికి వస్తుండటంతో ఇటీవల ఉద్ధవ్ సర్కార్ పత్రిలోని సాయిబాబా మందిర అభివృద్ధికి వంద కోట్ల రూపాయలను ప్రకటించింది. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. 
 
పత్రిని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ప్రకటనపై షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ట్రస్ట్.. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం షిరిడీ గ్రామస్తులతో సమావేశం అవుతోంది. 
 
వాస్తవానికి పత్రి ఆలయం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు.. షిరిడీలో కొలువైన సాయిబాబాను దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కొలుస్తుంటారు. అయితే, షిరిడీతో సమానంగా పత్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయాన్ని షిరిడీ సాయిబాబా సంస్థాన్ తప్పుబడుతోంది. పత్రిని అభివృద్ధి చేస్తే షిరిడీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది. సీఎం ప్రకటనకు వ్యతిరేకంగా రేపు షిరిడీ బంద్‌కు పిలుపునిచ్చింది. 
 
అంతే కాదు, రేపటి నుంచి షిరిడీ సాయి ఆలయంలో అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ట్రస్ట్ నిర్ణయంతో ఆలయానికి వచ్చే భక్తుల్లో ఆందోళన నెలకొంది.  అటు ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతోంది. కొత్త సర్కార్ వచ్చిన తర్వాతే సాయి జన్మభూమి వివాదం తెరపైకి వచ్చిందని కమలనాథులు విమర్శిస్తున్నారు. షిరిడీ ప్రజలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments