Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్... పవన్ కళ్యాణ్ 'గడ్డిపరకతో విప్లవం' స్టార్ట్

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (10:55 IST)
జనసేన పార్టీకి చెందిన 400 ఖాతాలను ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఖాతాలన్నీ జనసేన పార్టీకి చెందిన శతఘ్ని ఖాతాతో అనుసంధానమై ఉన్నాయి. ఈ చర్యపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. 
 
జనసేనకు మద్దతిస్తున్న 400 ట్విట్టర్ ఖాతాలను ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదు. నిస్సహాయులైన ప్రజల తరపున నిలబడుతున్నందుకే ఇలా చేస్తున్నారా? మేం ఎలా అర్థం చేసుకోవాలి? అంటూ నిలదీశారు. అంతేకాకుండా బ్రింగ్‌బ్యాక్‌జేఎస్‌పి‌సోషల్‌మీడియా అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. 
 
మరోవైపు, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సాగుతున్న సేవ్ నల్లమల ఉద్యమంలో ముందున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పర్యావరణ పరిరక్షణపై వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రకృతితో మమేకమవ్వాలన్న విషయాన్ని బలంగా చెబుతున్న ఆయన.. దానికి సంబంధించిన సుప్రసిద్ధ పుస్తకాలను తన ట్వీట్ల ద్వారా పరిచయం చేస్తున్నారు. 
 
తాజాగా ఆయన ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన 'గడ్డిపరకతో విప్లవం' (వన్ స్ట్రా రెవల్యూషన్‌) పుస్తకం గురించి ట్వీట్ చేశారు. ప్రకృతితో అనుసంధానమై వ్యవసాయం ఎలా చేయాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన పుస్తకమని పేర్కొన్నారు. ప్రకృతిమాత గురించిన లోతైన నిజాలను అర్థమయ్యేలా చేస్తుందన్నారు.  
 
జపాన్‌కు చెందిన మసనోబు.. తన జీవితమంతా ప్రకృతి వ్యవసాయంపై కృషి చేశారు. కృతిమ పద్ధతులకు స్వస్తి చెప్పి.. సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసి.. అద్భుతాలు సృష్టించారు. ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం మహత్వాన్ని తెలియజేశారు. ఆయన అనుభవాలే వన్ స్ట్రా రెవల్యూషన్ అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments