Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో ఉద్రిక్తత.. మహిళలను అడ్డుకున్న మహిళలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (11:34 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్ప దర్శనానికి వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శబరిమల ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 
 
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి మహిళా భక్తులు దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళా భక్తుల బృందం పంపా బేస్ క్యాంప్ చేరుకుంది. భక్తుల బృందంలో 20-50 ఏళ్ల వయస్సున్న మహిళలు ఉన్నారు. 
 
దర్శనం కోసం వచ్చిన మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పంబలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అంతకుముందు కొట్టాయం రైల్వేస్టేషన్ వద్ద మహిళా భక్తులు నిరసన తెలిపారు.
 
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నెల 27వ తేదీ వరకు 144 సెక్షన్ పొడిగించారు. ఇళావుంగల్ సన్నిధానం మార్గంలో చట్ట విరుద్ధంగా గుమికూడదని హెచ్చరికలు జారీచేశారు. శబరిమల ఆలయ కార్యకలాపాలు పర్యవేక్షణకు కేరళ హైకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చిన నివేదికను కేరళ ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments