Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలు.. 12 ఏళ్ల కుర్రోడు.. ఆంబులెన్స్‌కు అలా దారి చూపాడు..

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:43 IST)
వరద ఉధృతి, అంబులెన్స్ వచ్చేస్తోంది. కానీ వయస్సులో చిన్నవాడైనా ధైర్యంతో ముందుకెళ్లాడు. అంతేగాకుండా వరదలతో మునిగిపోయిన బ్రిడ్జిపై ధైర్యంగా ముందుకు దాటుతూ అంబులెన్స్‌కు మార్గం చూపించాడు. ఇదంతా చేసింది.. 12 ఏళ్ల బాలుడు మాత్రమే. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాయ్ చూర్ జిల్లాలోని దేవదుర్గ తాలుకాలో హిరేరాయంకుంపీ గ్రామంలో ఓ బ్రిడ్జి వరద నీటితో మునిగిపోయింది. రోడ్డంతా మునిగిపోవడంతో బ్రిడ్జి దాటేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. 
 
బ్రిడ్జీ ఎక్కడ వరకు ఉందో కూడా తెలియని పరిస్థితి. అప్పుడే ఓ ఆంబులెన్స్ అదే బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు సిద్ధమైంది. కానీ వరద నీరు కారణంగా బ్రిడ్జి దాటేందుకు ఆంబులెన్స్ ముందుకెళ్లలేదు. మధ్యలో వరదనీరు పొటెత్తడంతో అక్కడే నిలిచిపోయింది. 
 
ఇంతలో 12ఏళ్ల వెంకటేశ్ అనే బుడ్డోడు అక్కడికి చేరుకున్నాడు. వెంటనే తానున్నాను పదా అంటూ ధైర్యంగా ముందుకు సాగాడు. నీటిలో పడుతూ లేస్తూ ముందుకు నడుస్తూ ఆంబులెన్స్‌కు మార్గం చూపించాడు. ఆ బుడ్డోడిని అనుసరిస్తూ అంబులెన్స్ ముందుకు సాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా వెంకటేశ్ చేసిన సాహసానికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments