Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి?: జగన్మోహన్ రెడ్డి ప్రశ్న

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:14 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టనీయకుండా ఏపీ పోలీసులు అడ్డుకోవడంపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వర్మను అడ్డుకుని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే హైదరాబాద్‌కు పంపించడంపై జగన్ ఫైర్ అయ్యారు. దీనిపై స్పందించిన జగన్ వర్మను ఏపీ పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. 
 
రామ్‌గోపాల్‌ వర్మ ప్రెస్‌ మీట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతాయి, ఇలాంటి వైఖరి గర్హనీయమని ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.
 
ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో ఏపీ సర్కారుపై మండిపడ్డారు. మే ఒకటో తేదీన విడుదల చేసేందుకు నిర్ణయించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విశేషాలను వెల్లడించేందుకు సిద్ధమైన తనను అడ్డుకోవడం ఏమిటని వర్మ ప్రశ్నించారు. తామేమైనా ఉగ్రవాదులమా అని ప్రశ్నించిన ఆయన.. న్యాయపోరాటం తప్పదని స్పష్టం చేశారు.
 
కాగా.. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించేందుకు వర్మతో పాటు.. మూవీ యూనిట్‌ వచ్చింది. అయితే చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ ప్రకాశ్‌నగర్‌ సెంటర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా వెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments