Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సంచలనానికి తెరలేపనున్న జియో... కారు చౌకకే 5జీ స్మార్ట్ ఫోన్???

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (09:14 IST)
దేశీయ టెలికాం రంగనాన్ని షేక్ చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపనుంది. దేశంలో ఉచిత మొబైల్ సేవలను పరిచయం చేసి ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పాటు ప్రభుత్వ టెలికాం కంపెనీని చావుదెబ్బ కొట్టింది. అంతేకాకుండా, దేశ ప్రజలకు 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 
 
అలాగే, అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోను పరిచయం చేసింది. ఇపుడు మరో సంచలనానికి శ్రీకారం చుట్టనుంది. అదేంటంటే.. మరోమారు కారు చౌకకే 5జీ స్మార్ట్ ఫోనును ప్రవేశపెట్టనుంది. ఈ ఫోను ధర కనిష్టంగా రూ.2500 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు ఉండొచ్చని రిలయన్స్ జియో వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బేసిక్ 2జీ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీరిందరినీ తమవైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో 5జీ కారుచౌక స్మార్ట్‌ఫోన్లను అందివ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
దేశాన్ని 2జీ రహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఇటీవల ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. అందులో భాగంగానే 5జీ చౌక ఫోన్లపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ల కనీస ధర రూ.27 వేలుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments