Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణు యుద్ధానికి సై ... మా వ్యూహాలు మాకున్నాయి : ఐఏఎఫ్ చీఫ్ రాకేశ్

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (16:14 IST)
దాయాది దేశం పాకిస్థాన్ నిరంతరం కయ్యానికి కాలు దువ్వుతుందని అయినప్పటికీ తాము దేనికైనా సిద్ధమని ఐఎఎఫ్ చీఫ్ భదౌరియా స్పష్టం చేశారు. కేవలం భూతల యుద్ధానికే కాకుండా అణు యుద్ధానికి సైతం సిద్ధమని ఆయన ప్రకటించారు. 
 
భారత్‌తో అణు యుద్ధానికి సిద్ధమంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నూతన చీఫ్ ఎయిర్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా ధీటుగా స్పందించారు. అణుయుద్ధానికి మాత్రమే కాదనీ.. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 
 
భారత వైమానిక దళం 26వ దళపతిగా ఆర్.కె.ఎస్.భదౌరియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వాయుసేనాధిపతిగా ఉన్న బీఎస్ ధనోవా పదవీ కాలం సోమవారంతో ముగియడంతో ఆయన స్థానంలో భదౌరియాను కొత్త చీఫ్‌గా ఎంపిక చేయగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'అణ్వస్త్రాల గురించి వాళ్లకు అంతవరకే తెలుసు. కానీమాకంటూ వాటిపై సొంత అవగాహన ఉంది. మా వ్యూహాలు మాకున్నాయి. ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధం' అని ఆయన ప్రకటించారు. 
 
కాగా, ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా భదౌరియా రెండేళ్ల పాటు కొనసాగుతుంది. 1980 జూన్‌లో వాయుసేనలో చేరిన భదౌరియాకు... నాలుగు దశాబ్దాల్లో మొత్తం 4,250 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. తన కెరీర్‌లో ఆయన 26 రకాల విమానాలు నడిపారు. అతి విశిష్ట్ సేవా మెడల్, వాయు సేన మెడల్, పరమ్ విశిష్ట్ సేవా మెడల్ తదితర పతకాల్ని అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments