Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్‌ల భారతం : ఇది 'రిపబ్లిక్ ఇండియా' లేదా 'రేప్‌ పబ్లిక్' దేశమా?

ప్రపంచంలో వేదభూమిగా పేరుగాంచిన భరతగడ్డ కొందరు మృగాళ్ళు, కామాంధుల కారణంగా అత్యాచారాల కేంద్రంగా మారిపోతోంది. 2014-16 సంవత్సరాల మధ్యకాలంలో ఏకంగా లక్షకు పైచిలుకు మానభంగాలు జరిగాయి. ఈ విషయాన్ని కేంద్రమే స్

Webdunia
గురువారం, 19 జులై 2018 (14:28 IST)
ప్రపంచంలో వేదభూమిగా పేరుగాంచిన భరతగడ్డ కొందరు మృగాళ్ళు, కామాంధుల కారణంగా అత్యాచారాల కేంద్రంగా మారిపోతోంది. 2014-16 సంవత్సరాల మధ్యకాలంలో ఏకంగా లక్షకు పైచిలుకు మానభంగాలు జరిగాయి. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా వెల్లడించింది. ఈ పరిణామం ప్రతి పౌరుడు తలదించుకునేలా చేస్తోంది.
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు సమాధానమిస్తూ, దేశ్యాప్తంగా 2014-16 మధ్య ఏకంగా 1,10,333 అత్యాచార కేసులు నమోదైనట్లు సభకు తెలిపారు. 2014లో 36,375 కేసులు, 2015లో 34,561 కేసులు, 2016లో 38,947 కేసులు నమోదైనట్లు వివరించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రేప్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు. 12 ఏళ్లు, ఆ లోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిపారు. ప్రతిపాదిత బిల్లు త్వరలోనే లోక్‌సభ ముందుకు రానున్నట్టు వివరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments