Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లకు గ్రీన్ సిగ్నల్ - తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు...

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:01 IST)
కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా సుమారు గత 50 రోజులుగా పరుగులు తీయని రైళ్లు... మంగళవారం నుంచి మళ్లీ పట్టాలపై తిరగనున్నాయి. ఇందుకోసం కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే, పలు ఆంక్షల మధ్య ఈ రైళ్లను నడుపుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మూడో దశ లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఇది పూర్తిగా ముగియకముందే... రైళ్ల రాకపోకలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 
 
దీంతో 12వ తేదీ నుంచి 15 జతల రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ రైళ్లు దేశంలోని ముఖ్య నగరాల మధ్య తిరుగుతాయి. ఈ రైళ్ళలో ప్రయాణం చేయదలచిన వారు విధిగా రిజర్వేషన్ చేసుకోవాల్సివుంటుంది. టిక్కెట్ కౌంటర్ల వద్ద ప్రయాణ టిక్కెట్లను విక్రయించరు. అలాగే, ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాతనే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 
 
12వ తేదీ నుంచి పరుగులు తీయనున్న రైళ్ల వివరాలను పరిశీలిస్తే, హౌరా - న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ - న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ - న్యూఢిల్లీ, న్యూఢిల్లీ - జమ్మూతావి, బెంగళూరు - న్యూఢిల్లీ, తిరువనంతపురం - న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ - న్యూఢిల్లీ, బిలాస్ పూర్ - న్యూఢిల్లీ, రాంచీ - న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ - న్యూఢిల్లీ, అహ్మదాబాద్ - న్యూఢిల్లీ, అగర్తలా - న్యూఢిల్లీ, భువనేశ్వర్ - న్యూఢిల్లీ, మడ్‌గావ్ - న్యూఢిల్లీ, సికింద్రాబాద్ - న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగుతాయి.
 
అయితే, రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, 
* బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. 
 
* న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్‌లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి. 
 
* సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా సాగుతుంది. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments