Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకే సంచలన నిర్ణయం : నేడు కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన

Webdunia
సోమవారం, 2 మే 2022 (08:40 IST)
జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ఆయన.. ఏకంగా కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన సోమవారం కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఉత్తరాదిలో జోరుగా చర్చ సాగుతోంది. 
 
అంతేకాకుండా, ఐప్యాక్ నుంచి తప్పుకుని పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌లోనూ అదే హాట్ టాపిక్‌గా మారింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, బీహార్‌లో ఆదివారం భావసారూప్య పార్టీలతో ఆయన చర్చలు జరిపారు. 
 
మరోవైపు, ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. పైగా, ఆ పార్టీలో కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయన ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లించింది. వ్యూహకర్త కమిటీలో ఒక సభ్యుడుగా మాత్రమే ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments