పీకే సంచలన నిర్ణయం : నేడు కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన

Webdunia
సోమవారం, 2 మే 2022 (08:40 IST)
జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ఆయన.. ఏకంగా కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన సోమవారం కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఉత్తరాదిలో జోరుగా చర్చ సాగుతోంది. 
 
అంతేకాకుండా, ఐప్యాక్ నుంచి తప్పుకుని పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌లోనూ అదే హాట్ టాపిక్‌గా మారింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, బీహార్‌లో ఆదివారం భావసారూప్య పార్టీలతో ఆయన చర్చలు జరిపారు. 
 
మరోవైపు, ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. పైగా, ఆ పార్టీలో కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయన ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లించింది. వ్యూహకర్త కమిటీలో ఒక సభ్యుడుగా మాత్రమే ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments