Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకే సంచలన నిర్ణయం : నేడు కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన

Webdunia
సోమవారం, 2 మే 2022 (08:40 IST)
జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ఆయన.. ఏకంగా కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన సోమవారం కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఉత్తరాదిలో జోరుగా చర్చ సాగుతోంది. 
 
అంతేకాకుండా, ఐప్యాక్ నుంచి తప్పుకుని పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌లోనూ అదే హాట్ టాపిక్‌గా మారింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, బీహార్‌లో ఆదివారం భావసారూప్య పార్టీలతో ఆయన చర్చలు జరిపారు. 
 
మరోవైపు, ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. పైగా, ఆ పార్టీలో కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయన ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లించింది. వ్యూహకర్త కమిటీలో ఒక సభ్యుడుగా మాత్రమే ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. 

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments