Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ తిరుపతి వస్తున్నారు.. మీ కార్లు జాగ్రత్త అంటూ దండోరా వేసిన జనసేన

Webdunia
ఆదివారం, 1 మే 2022 (22:38 IST)
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర పరువు గంగలో కలిసిపోతుంది. జగన్ రెడ్డి వైఖరికి తోటు అధికారుల అత్యుత్సాహం, అతి చేష్టలు రాష్ట్రం పరువును మరింతగా దిగజార్చుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ ఒంగోలు జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కాన్వాయ్ కోసం తిరుమల వెళుతున్న భక్తుల కారును ఆపి ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైగా, భక్తులు బస్సులో వెళ్లాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీవో అధికారులు ట్రావెల్ కారును స్వాధీనం చేసుకున్నవార్త జాతీయ మీడియాలో వైరల్ అయింది. 
 
ఇదిలావుంటే, ఈ నెలలో సీఎం జగన్ తిరుపతి పర్యటనకు రానున్నారు. దీంతో జనసేన పార్టీ తిరుపతి విభాగం నేతలు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ తిరుపతి వస్తున్నారని, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ దండోరా వేశారు. 
 
జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, తిరుపతిలో చాటింపు వేశారు. సీఎం జగన్ మే 5న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments