Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ పెదనాన్నగారా? ఐతే ఏంటి మెట్లు ఎక్కి రమ్మనండి.. ఎవరు?

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:37 IST)
రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే తెలియనివారు ఎవరూ వుండరు. ఐతే అలాంటి నటుడుకి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. దుర్గమ్మకు కుంకుమార్చన చేసేందుకు సతీసమేతంగా కృష్ణంరాజు ఇంద్రకీలాద్రి పర్వతం వద్దకు చేరుకున్నారు. విఐపి దర్శనం ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామనుకున్నారు. కానీ ఆలయ సిబ్బంది ఆయనను పట్టించుకోలేదని సమాచారం. 
 
నటుడు కృష్ణంరాజు అని తెలిసినా, ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారనీ తెలిసినా, ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న అని తెలిసినా దుర్గ గుడి సిబ్బంది మాత్రం ఎంతమాత్రం పట్టించుకోలేదట. దానితో కృష్ణంరాజు ఓ సాధారణ భక్తుని క్యూ లైన్లో నిలబడి మొత్తం 6 అంతస్తులు ఎక్కి వెళ్లి దుర్గమ్మను దర్శించుకుని కుంకుమార్చన చేశారట. 
 
ఐతే ఆయనకు మోకాళ్ల నొప్పులు సమస్య వున్నది, పైగా కాస్త అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఐనప్పటికీ సీనియర్ నటుడు కృష్ణం రాజును సిబ్బంది అనుమతించకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు కూడా తన ఆవేదనను తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments