Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. హస్తినకు రావాలంటూ పిలుపు

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (12:34 IST)
వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకస్మికంగా ఫోన్ చేశారు. ఆమెతో ఏకంగా పది నిమిషాల పాటు మాట్లాడారు. తక్షణం ఢిల్లీకి రావాలని ఆమెకు సూచించారు. తెలంగాణంలోని అధికార తెరాస పార్టీ దాడి నేపథ్యంలో షర్మిలకు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర నేపథ్యంలో ఆమెపై తెరాస శ్రేణులు దాడి చేశాయి. ఆ తర్వాత ఈ ఘటనకు నిరసనగా ఆమె ధ్వంసమైన తన కారులోనే సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ ముట్టడికి వెళుతుండగా ఆమె కారు సీట్లో ఉండగానే వాహనాన్ని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయిన విషయం తెల్సిందే. షర్మిల కారులోనే కూర్చొనివుండగా, పోలీసులు ఆమె కారును టోయింగ్ చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. 
 
ఈ నేపథ్యంలో షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. పైగా, ఢిల్లీకి రావాలని సూచించారు. తనకు అండగా నిలిచి, పరామర్శించిన ప్రధానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని కోరిక వినతి మేరకు ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు. ఏదిఏమైనా షర్మిలకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేయడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో సంచనలనంగానూ, చర్చనీయాంశంగాను మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments