Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికుల కోసం కొత్త పథకం : బీహార్‌లో ప్రారంభించిన ప్రధాని మోడీ

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (13:48 IST)
కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలను జాతియావత్తూ కనులారా చూసింది. ఒక్కో వలస కార్మికుడి కష్టాలు విని, చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు. అలాంటి వరస కార్మికులను ఆదుకునేందుకు వీలుగా కేంద్రం రంగంలోకి దిగింది. 
 
ఇందులోభాగంగా, సుమారుగా రూ.50 వేల కోట్ల వ్యయంతో గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ అనే పేరుతో సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడమే ఈ పథకం లక్ష్యం. 
 
కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన వారికి పని కల్పించి, వారికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్టు ఈ పథకం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 
 
ఈ పథకాన్ని శనివారం బీహార్ రాష్ట్రంలోని ఖగారియా జిల్లాలో ప్రధాని మోడీ ప్రారంభించారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ, వ్యూహాత్మకంగా పథకం ప్రారంభానికి ఈ జిల్లాను మోడీ ఎంచుకున్నారు. శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ పథకాన్ని ప్రారంభించారు. 
 
లాక్డౌన్ కారణంగా తామున్న ప్రాంతంలో పనులు లేక, అష్టకష్టాలు పడుతూ స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికుల అవస్థలు తనను కదిలించాయని, వారి కోసమే ఈ పథకమని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. 
 
'వలస కార్మికులకు వారి ఇళ్లకు సమీపంలోనే పనులు ఇస్తాం. ఇప్పటివరకూ మీ ప్రతిభను నగరాభివృద్ధికి వినియోగించారు. ఇక మీ ప్రాంతంలో అభివృద్ధికి, మీ సమీప ప్రాంతాల అభివృద్ధికి వినియోగించండి' అని కార్మికులను ఉద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 
 
లాక్డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రత్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా స్వస్థలాకు చేరవేశామని, ఇప్పుడు అక్కడే పనులు చేసుకునేందుకు గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజనను తీసుకొస్తున్నామని అన్నారు. 
 
ప్రభుత్వ కాంట్రాక్టు పనుల ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించామని, ఇందుకు రూ.50 వేల కోట్లను ఖర్చు చేస్తామని ఈ సందర్భంగా మోడీ వెల్లడించారు. 
 
కాగా, ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని వలస కార్మికులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments