Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనతో కటీఫ్ చెప్పిన ఏకైక ఎమ్మెల్యే రాపాక?

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (13:23 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు. రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి ఈయన గెలుపొందారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ.. రాపాక మాత్రం వైకాపా ఫ్యాను గాలి స్పీడును తట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన జనసేనతో అంటీఅంటనట్టుగా ఉంటూ వచ్చారు. అదేసమయంలో అధికార వైకాపాకు దగ్గరవుతూ వచ్చారు. 
 
అసెంబ్లీ సమావేశాల్లోను ప్రతిపక్ష సభ్యుడి హోదాలో అధికార పార్టీని పొగుడుతూ ప్రసంగాలు చేశారు. దీంతో పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ కూడా పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపాక ఏ పార్టీలో ఉన్నారో ఆయనే చెప్పాలని కూడా వ్యాఖ్యానించారు. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా వైసీపీకి ఓటేయడంతో జనసేనతో కటీఫ్‌ అని తేలిపోయింది. వైకాపాకు ఓటు వేయడం ద్వారా ఆయన తాను వైకాపా వైపు ఉన్నట్టు స్పష్టం చేసినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments