హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా పేరు మార్చుతారా?

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (18:17 IST)
హైదరాబాద్ నగర కేంద్రంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన విజయ్ సంకల్ప్ పేరుతో భారీ బహిరంగ సభతో ఈ సమావేశాలను పూర్తి చేశారు.
 
అయితే, హైదారబాద్ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో ఎక్కడా కూడా హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ అని ప్రస్తావించలేదు. ఆయన హైదరాబాద్ నగరాన్ని భాగ్య నగర్ అంటూ పదేపదే సంభోదించారు. 
 
నాడు భారతదేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ పల్లాభాయ్ పటేల్ భాగ్య నగర్ నుంచే తన ప్రస్థానాన్ని ఆరంభించారని వెల్లడించారు. ఏకీకృత భారతావనికి పటేల్ భాగ్య నగర్ ‌లోనే పునాది రాయి వేశారంటూ కీర్తించారు. పైగా, ఇది మనందరిరికీ చారిత్రక ఘట్టమని మోడీ అభినందించారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను బీజేపీ మోగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ వైఫల్యాలపై ఈటల రాజేందర్‌తో ప్రధాని మోడీ, జేపీ నడ్డా చర్చలు జరిపినట్లు సమాచారం.
 
ప్రధాని మోడీ, జేపీ నడ్డా ఈటలను మెచ్చుకున్నారని చెబుతున్నారు. ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విజయం సాధించేందుకు బీజేపీ అన్ని నిర్ణయాలు తీసుకుందని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments