Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదీ.. సామాజిక దూరం అంటే... దేశ పౌరులారా చూసి నేర్చుకోండి... నెటిజన్స్

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (19:17 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ వైరస్ వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు సామాజిక భౌతిక దూరాన్ని పాటించాలని నిపుణులు సూచన చేస్తున్నారు. 
 
వ్య‌క్తికి వ్య‌క్తికీ మ‌ధ్య సామాజిక దూరం (సోష‌ల్ డిస్టేన్స్) పాటిస్తే క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చ‌ని డాక్ల‌రు, నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ.. చాలా మంది పౌరులు వీరి సూచనలు బేఖాతర్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కొన్ని జంతువులు, పక్షులు మాత్రం ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్టుగా ఉన్నాయి. అందుకే అవి సామాజికి దూరాన్ని పాటిస్తున్నాయి. ఇటీవల రోడ్డును దాటుకునే సమయంలో ఏనుగులు దూరం దూరంగా నడుస్తూ వెళ్లాయి. 
 
ఇపుడు కొన్ని నెమళ్లు కూడా ఇదే విధంగా నడుచుకున్నాయి. సామాజిక దూరం పాటించ‌డం అంటే ఇట్లా... అంటూ చెప్తున్న‌ట్లుగా ఉన్న ఓ ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది. రాజ‌స్థాన్ రాష్ట్రంలోని నగౌర్ ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల వ‌రండాలో నెమ‌ళ్లు ఒక‌దానికొక‌టి దూరం పాటిస్తూ... క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌డుకున్న ఫొటోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ షేర్ చేశారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెమళ్లకు ఉన్న జ్ఞానం, తెలివి మన పౌరులకు లేదని, వీటిని చూసైనా ప్రజలు తెలుసుకోవాలంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments