గాంధీ తరహాలో రైలు యాత్ర.. విజయవాడ నుంచి.. పక్కనే నాదెండ్ల

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (16:39 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరికొత్త రీతిలో ప్రజాపోరాట యాత్ర చేపట్టారు. స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత గాంధీజీ ఏ రైలు యాత్రను చేపట్టారో అదే యాత్రకు పవన్ శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి తుని వరకు ప్రజలతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. ఈ యాత్ర గురువారం సాయంత్రం 5.20 గంటలకు ముగియనుంది. 
 
దేశంలో రైలు యాత్రలు చేపట్టిన పార్టీ అధినేతలలో పవన్ ఒకరు. మహాత్మగాంధీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ రైలు యాత్రకు శ్రీకారం చుట్టారు. రైలులో ప్రయాణిస్తూ అసంఘటిత కార్మికులతోనూ, ఏలూరులో అసంఘటిత వర్తకుల సమస్యలను జనసేనాని అడిగి తెలుసుకున్నారు.   ప్రయాణికులతోనూ, మామిడి రైతులతోనూ మాట్లాడారు.
 
అనంతరం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కూడా ప్రజలతో మమేకమయ్యారు పవన్‌కల్యాణ్. తదనంతరం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, సామర్లకోటలలో పవన్ కళ్యాణ్ ప్రజలతో సమావేశమై వారి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీయనున్నారు. అలా సాయంత్రం 5.20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ రైలు యాత్ర కొనసాగనుంది. ఆ తర్వాత తుని చేరుకుని తునిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. కాగా పవన్ కల్యాణ్ వెంట మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనాని వెంటనే వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

తర్వాతి కథనం
Show comments