Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతలకు పౌరుషం లేదు.. పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (14:01 IST)
తెలుగుదేశం పార్టీ నేతలకు ఏమాత్రం పౌరుషం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతితో కూడిన రాజకీయ వ్యవస్థ నెలకొని ఉందని, దీనిని చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. 
 
తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఓడిపోవడానికైనా సిద్ధపడతాను కానీ పార్టీ విలువలను చంపనన్నారు. ఏటా సినిమాల ద్వారా రూ.100 కోట్లు సంపాదిస్తే అందులో 25 కోట్లు పన్నులుగా కడతానన్నారు. 
 
అయినా సినిమాలపై మమకారం లేదని సమాజంపై బాధ్యత ఉందన్నారు. కార్యకర్తలు కొట్టే చప్పట్లు, కేరింతలు తనను సంతోష పెట్టవని... వాటిని బాధ్యతగా స్వీకరిస్తానన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నారు. సినిమాలు కేవలం అవగాహన కల్పించడానికేనని, రాజకీయాలు వాటిని పరిష్కరించ డానికి దోహదపడతాయన్నారు.
 
వ్యాపారులు ఎంపీలుగా వెళ్తుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నారు. కులాల ముసుగులో ఉన్నవారిని ప్రజాకోర్టులో నిలదీద్దామన్నారు. వాల్మీకి, యోగి వేమనల్లో మార్పు వచ్చినట్టే చంద్రబాబు మనసు కూడా మారుతుందనే చిన్నపాటి నమ్మకంతో 2014లో మద్దతు ఇచ్చానని, అయితే ఆయన ఇంకా నిద్రాణంలోనే ఉన్నారన్నారు. మెట్టుమెట్టుగా ఎదుగుదామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments