Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య నాయుడు, చిరంజీవి గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాలు

ఐవీఆర్
గురువారం, 25 జనవరి 2024 (23:49 IST)
కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2024ను ప్రకటించింది. ఆయా రంగాల్లో విశేషమైన సేవలు అందించేవారికి ఈ అవార్డులతో కేంద్రం సత్కరిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు దక్కాయి. అందులో ఐదుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడు(ప్రజా వ్యవహారాలు), మెగాస్టార్ చిరంజీవి(కళారంగం) గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి. అలాగే తమిళనాడు నుంచి వైజయంతి మాల బాలి(కళారంగం), పద్మ సుబ్రహ్మణ్యం(కళారంగం) గార్లకు పద్మవిభూషణ్ దక్కగా, బీహార్ నుంచి బిందేశ్వర్ పాఠక్(సామాజిక సేవ)కు పద్మవిభూషణ్ దక్కింది. 
 
అలాగే 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగువారిలో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పలు వున్నారు. అత్యున్నత పురస్కారం భారతరత్నను బీహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్(మరణానంతరం) ఇటీవల ప్రకటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments