Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరంకు షాక్.. విచారణాధికారిపై బదిలీవేటు.. ఈడీ చర్యలు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (14:00 IST)
ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్‌లో అరెస్టు అయిన కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసును ఆది నుంచి విచారిస్తూ వచ్చిన అహుజాపై బదిలీ వేటు వేసి, ఈ కేసును విచారించేందుకు కొత్త అధికారిని నియమించింది. దీంతో ఈ కేసు విచారణ మొదటి నుంచి సాగనుంది.
 
అదేసమయంలో ఈ స్కామ్‌లో చిదంబరం వద్ద విచారించేందుకు వీలుగా ప్రశ్నావళిని రూపొందించింది. చిదంబరం వద్ద విచారించేందుకు సీబీఐ అధికారులు  100 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సమాచారం.
 
మరోవైపు, చిదంబరం అరెస్టు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సీబీఐ, ఈడీలను స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరంకు అండగా ఉంటామని... చివరివరకు పోరాడుతామని తెలిపింది.
 
కాగా, ఈ కేసులో చిదంబరంను బుధవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాత్రంతా చిదంబరంను ఉంచారు. గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంను హాజరుపరిచి, విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments