Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు పారిపోయిన నిత్యానంద.. కిడ్నాప్, రేప్ కేసు నమోదు కాగానే జంప్?

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (10:33 IST)
వివాదాస్పద బాబా నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానంద దేశం వదలి విదేశాలకు పారిపోయాడని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. నిత్యానంద తన అనుచరులైన సాధ్వీ ప్రణప్రియానంద, ప్రియతత్వ రిద్ది కిరణ్ అనే మహిళలు ఇద్దరు పిల్లలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేశారు. 
 
మొత్తం నలుగురు పిల్లలను కిడ్నాప్ చేసి.. వారిని ఓ ఇంట్లో నిర్బంధించారని పోలీసులు తెలిపారు. వారిని బాల కార్మికులుగా మార్చి ఆశ్రమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటారని చెప్పారు. ఆ నలుగురు పిల్లలకు విముక్తి కల్పించామని.. వారి వాంగ్మూలం ఆధారంగానే నిత్యానందపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కేసులో కీలక నిందితుడైన నిత్యానంద భారత్ తిరిగి రాగానే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
 
అయితే ఓ రేప్ కేసులో నిత్యానందపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయాడని అహ్మదాబాద్ ఎస్పీ ఆర్వీ అసారి చెప్పారు. నిత్యానందకు ఎక్కడికి పారిపోయి ఉంటాడో తెలుసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను గుజరాత్ పోలీసులు కోరారు. అయితే హోంమంత్రిత్వ శాఖ మాత్రం గుజరాత్ పోలీసులు నంచి అధికారికంగా తమకెలాంటి విజ్ఞప్తి రాలేదని తెలిపింది. ప్రస్తుతానికైతే నిత్యానందకు సబంధించిన ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments