Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ తల్లిదండ్రులకు నిర్భయ తల్లి అండ... మీకు మాలాగా జరగదు అంటు భరోసా

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (13:44 IST)
హైదరాబాద్ నగరంలో అత్యాచారం, ఆ తర్వాత హత్యకు గురైన దిశ తల్లిదండ్రులకు ఢిల్లీకి చెందిన నిర్భయం తల్లిదండ్రులు అండగా నిలిచి, తమ నైతిక మద్దతును ప్రటించారు. ఈ మేరకు నిర్భయ తల్లి నుంచి దిశ తల్లిదండ్రులకు ఓ సందేశం వచ్చింది. తమ బిడ్డను దారుణాతి దారుణంగా హత్య చేసిన దోషులకు సరైనశిక్ష పడలేదని, తద్వారా తమకు న్యాయం జరగలేదని నిర్భయం తల్లి వాపోయారు. 
 
కానీ, హైదరాబాద్ నగరంలో హత్యకు గురైన దిశ తల్లిదండ్రులకు మాత్రం సత్వర న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. 'హైదరాబాద్‌లో పశువైద్యురాలు అత్యాచారం, హత్య అత్యంత దారుణం. మా బిడ్డ విషయంలో మేము ఏడేళ్లుగా పోరాడుతూనే ఉన్నాము. కానీ, దిశ విషయంలో న్యాయం త్వరితగతిన జరుగుతుంది. నాటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి' అని దిశ తల్లిదండ్రులకు నిర్భయ తల్లి పంపిన సందేశంలో పేర్కొన్నారు. 
 
కాగా, న్యూఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో ఆశాదేవి కుమార్తె నిర్భయ (23)ను ఆరుగురు కామాంధులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి నుంచి 17 తెల్లవారుజాము వరకూ ఈ దారుణం జరుగగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు కన్నుమూసింది. దేశ యువతలో వెల్లువెత్తిన నిరసనతో చట్టాలు కఠినమయ్యాయి. కొత్తగా నిర్భయ చట్టం వచ్చిందన్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments