ఫోటోలు తీసిన నాసా ఆర్బిటర్.. అయినా విక్రమ్ జాడ కనిపించలేదు..

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (14:36 IST)
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలోని ల్యాండప్ విక్రమ్ పరిస్థితిపై ఇంకా స్పష్టత రావట్లేదు. చంద్రుడి ఉపరితలంపై నిస్తేజంగా వున్న ల్యాండర్ విక్రమ్ ఫోటోలు తీసేందుకు నాసా మరోసారి ప్రయత్నం చేసింది. విక్రమ్ దిగినట్లు భావిస్తున్న ప్రాంతాన్ని నాసాకు చెందిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్‌వో) అక్టోబర్ 14న ఫోటోలు తీసింది. 
 
కానీ ఈ చిత్రాల్లో విక్రమ్ ఆచూకీ మాత్రం లభించలేదని నాసా తేల్చేసింది. ఈ ఫొటోల్లోనూ విక్రమ్‌ కనిపించలేదని నాసా ప్రకటించడంతో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. ఖక్షాంశం తక్కువగా ఉండడం వల్ల ల్యాండర్‌ దిగిందని భావిస్తున్న ప్రాంతంలో ఎప్పుడూ నీడ ఉంటుంది. ఆ నీడలోనైనా ల్యాండర్‌ ఉండాలి. లేదా నిర్దేశించిన ప్రాంతానికి అవతల అయినా ఉండొచ్చునని ఎల్‌ఆర్‌ఓ డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్‌ జాన్‌కెల్లర్‌ తెలిపారు.
 
కాగా విక్రమ్ ఆచూకీ కోసం నాసా గతంలో ప్రయత్నించిన సంగతి తెలిసిందే. విక్రమ్ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని సెప్టెంబర్ 17న ఎల్ఆర్‌వో ఫోటోలు తీసింది. కానీ ఆ సమయంలో చీకటి ఎక్కువగా వుండటంతో విక్రమ్ గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments