Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటికన్ సిటీలో ప్రధాని మోదీ- పోప్ ఆత్మీయ ఆలింగనం, ఆ తర్వాత...

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (18:28 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం వాటికన్ సిటీకి చేరుకున్నారు. క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు.


భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. దాదాపు 20 నిమిషాలపాటు సమావేశం జరగాల్సి ఉండగా గంటపాటు సాగింది. స్థానిక కాలమానం ప్రకారం దాదాపు 8.30 గంటలకు వాటికన్ ప్రాంగణానికి చేరుకున్నారు మోదీ. అక్కడి సీనియర్ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

 
మోడీ వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. పోప్‌ను ప్రధాని మోదీ కలిసినప్పుడు, పోప్ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో గాఢమైన సాన్నిహిత్యం, పరస్పర గౌరవం, ప్రేమ తొణికిసలాడింది.

 
తొలుత పోప్‌ను ఏకాంతంగా కలిసిన మోదీ, ఆ తర్వాత ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సాంప్రదాయకంగా, పోప్‌తో సమావేశానికి ముందుగా నిర్ణయించిన ఎజెండా లేదు. 
ప్రధాన మంత్రి- పోప్ మధ్య సాధారణ ప్రపంచ పరిస్థితులు, సమస్యలు, ఇతర విషయాలపై చర్చ జరిగింది.
ప్రపంచాన్ని మెరుగుపరిచే వాతావరణ మార్పు, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై చర్చించారు. కోవిడ్ మహమ్మారి, ఆరోగ్యం, శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు కలిసి పనిచేసే విధానంపై కూడా చర్చలు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments