Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటికన్ సిటీలో ప్రధాని మోదీ- పోప్ ఆత్మీయ ఆలింగనం, ఆ తర్వాత...

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (18:28 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం వాటికన్ సిటీకి చేరుకున్నారు. క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు.


భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. దాదాపు 20 నిమిషాలపాటు సమావేశం జరగాల్సి ఉండగా గంటపాటు సాగింది. స్థానిక కాలమానం ప్రకారం దాదాపు 8.30 గంటలకు వాటికన్ ప్రాంగణానికి చేరుకున్నారు మోదీ. అక్కడి సీనియర్ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

 
మోడీ వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. పోప్‌ను ప్రధాని మోదీ కలిసినప్పుడు, పోప్ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో గాఢమైన సాన్నిహిత్యం, పరస్పర గౌరవం, ప్రేమ తొణికిసలాడింది.

 
తొలుత పోప్‌ను ఏకాంతంగా కలిసిన మోదీ, ఆ తర్వాత ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సాంప్రదాయకంగా, పోప్‌తో సమావేశానికి ముందుగా నిర్ణయించిన ఎజెండా లేదు. 
ప్రధాన మంత్రి- పోప్ మధ్య సాధారణ ప్రపంచ పరిస్థితులు, సమస్యలు, ఇతర విషయాలపై చర్చ జరిగింది.
ప్రపంచాన్ని మెరుగుపరిచే వాతావరణ మార్పు, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై చర్చించారు. కోవిడ్ మహమ్మారి, ఆరోగ్యం, శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు కలిసి పనిచేసే విధానంపై కూడా చర్చలు జరిగాయి.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments