Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీపై బాలకృష్ణ విమర్శలు.. అవి ఏపీ ప్రజల ఆవేదన మాత్రమే

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మోదీని శిఖండి

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (17:36 IST)
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మోదీని శిఖండి అని, తరిమితరిమి కొడతామన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని, ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని బాలకృష్ణ తెలిపారు. ఆదివారం గుంటూరు చిలకలూరి పేటలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మోదీపై తాను చేసిన వ్యాఖ్యలు.. ఏపీ ప్రజల మనోవేదన అన్నారు. 
 
కాస్టింగ్ కౌచ్‌పై బాలయ్య స్పందిస్తూ.. తెలుగు సినీ పరిశ్రమలో చెలరేగుతోన్న వివాదంపై పెద్దలు కూర్చొని మాట్లాడటం శుభపరిణామమన్నారు. కాగా కేఎస్‌ రవికుమార్ దర్శకత్వంలో సీకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సీ కల్యాణ్‌ నిర్మించిన ''జై సింహ'' ఈ ఏడాది జనవరి 12న విడుదలైన ఈ సినిమా శనివారం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇందులో బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ, నటాషా దొషీ నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments