Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను భయపడినంత జరిగింది.. వెళ్లొద్దని మా నాన్నకు చెప్పాను..

నాగ్‌పూర్‌లో వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు.. ఆయన కుమార్తె షర్మిష్ట ముఖర్జీ కూడా తప్పుబడుతున్నారు.

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (15:38 IST)
నాగ్‌పూర్‌లో వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు.. ఆయన కుమార్తె షర్మిష్ట ముఖర్జీ కూడా తప్పుబడుతున్నారు. ఈ సమావేశానికి వెళ్లడం వల్ల లేనిపోని సమస్యలు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే హెచ్చరించినట్టు ఆమె గుర్తుచేశారు.
 
ప్రణబ్ ఈ కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చిన తర్వాత ఓ మార్ఫింగ్ ఫొటో చర్చనీయాంశమైంది. ఆ ఫొటోలో ప్రణబ్.. ఆరెస్సెస్ ప్రార్థన చేసే సమయంలో కుడిచేతిని ఛాతీకి సమాంతరంగా ఎలా ఉంచుతారో అలా చేసినట్లుగా ఉంది. నిజానికి ప్రార్థన సమయంలో ప్రణబ్ అలా చేయలేదు. దీనికి సంబంధించిన అసలు, నకిలీ ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. బీజేపీ-ఆరెస్సెస్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతారని తెలిసే ముందే ప్రణబ్‌ను హెచ్చరించానని ఆయన కూతురు షర్మిష్ఠ అన్నారు.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, నేను భయపడినంత జరిగింది. అందుకే అక్కడికి వెళ్లొద్దని మా నాన్నకు చెప్పాను. కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే బీజేపీ ఇలా చిల్లర రాజకీయాలకు తెరతీసింది అంటూ అసలు, నకిలీ ఫొటోలు ఉన్న ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. నకిలీ కథనాలను సృష్టించేందుకు ఆరెస్సెస్‌కు ప్రణబ్ ఓ అవకాశం ఇస్తున్నారని గురువారమే షర్మిష్ఠ అన్నారు. ఆమె ఊహించినట్లే ప్రణబ్ నాగ్‌పూర్ వెళ్లకముందే ఆమె బీజేపీలో చేరబోతున్నదన్న పుకార్లు మొదలయ్యాయి. దీనిని షర్మిష్ఠ ఖండించారు. కాంగ్రెస్‌ను వీడటం కంటే.. రాజకీయాలనే వదిలేస్తానని ఆమె తేల్చిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments