బాధితుల శరీరాన్ని తాకినా మంకీపాక్స్ సోకుతుంది...

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (10:45 IST)
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తొలి మంకీపాక్స్ మృతి కేసు నమోదైంది. విదేశాల నుంచి కేరళ రాష్ట్రానికి వచ్చిన ఓ యువకుడు ఈ వైరస్ నుంచి కోలుకోలేక మృతి చెందాడు. ఇది మన దేశంలో నమోదైన తొలి మృతి కేసు. అయితే, ఈ మంకీపాక్స్ వైరస్...  బాధితుల శరీరాన్ని తాకడం, పట్టుకోవడం ద్వారా సన్నిహితంగా మెలగడం వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
స్వలింగ సంపర్కులే దీని వ్యాప్తికి కారకులుగా పేర్కొనడం.. ఎయిడ్స్‌ విషయంలో చేసిన పొరపాటును పునరావృతం చేయడమే అవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం స్వలింగ సంపర్కుల్లోనే కాకుండా ఎవరికైనా మంకీపాక్స్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 
 
బాధితుల శరీరాన్ని లేదా వారి దుస్తులను తాకడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఎయిమ్స్‌ (ఢిల్లీ) డెర్మటాలజీ, వెనెరియాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ సోమేశ్‌ గుప్తా తెలిపారు. ఈ మేరకు బాధితులతో కలిసిమెలిసి ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

తర్వాతి కథనం
Show comments