Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో విషాదం - విద్యుదాఘాతానికి 10 మంది కన్వర్ యాత్రికుల మృతి

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (10:31 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రక్కు విద్యుదాఘాతానికి గురైంది. దీంతో 10 మంది కన్వర్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కులో జల్పేష్ వెళుతుండగా కూచ్ బెహార్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీనికి జనరేటర్ వైర్లే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
గాయపడిన వారిలో 16 మందిని మెరుగైన వైద్య సేవల కోసం జల్పాయ్‌గురి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రక్కులో డీజే సిస్టం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగానే విద్యుదాఘాతం సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
మేఖ్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్లా బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగిందని మఠభంగ అడిషినల్ ఎస్పీ అమిత్ వర్మ తెలిపారు. కన్వర్ భక్తులంతా సీతల్‌కుచి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నారని అమిత వర్మ వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments