Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదు - దేశంలో 7కి చేరిన కేసులు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (13:46 IST)
దేశంలో ఒకవైపు కరోనా వైరస్‌తో పాటు మరోవైపు మంకీపాక్స్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ రోజువారీ నమోదు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ మంకీపాక్స్ వైరస్ మాత్రం చాపకిందనీరులా వ్యాపిస్తుంది. ఫలితంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఏడుగుకు చేరింది. 
 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 27న కోజికోడ్ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన్ను మలప్పురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
 
కాగా, మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తి త్రిశూర్‌లో ఈ నెల ఒకటో తేదీన ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో అతనితో సంబంధాలు కలిగిన 20 మందిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments