Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక గొడుగు ఎంత పనిచేసింది.. యానిమేటెడ్ పోస్టు వైరల్

Webdunia
శనివారం, 2 మే 2020 (17:04 IST)
Modi, Vijayan
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆరోగ్యశాఖమంత్రి కేకే శైలజ వర్షం కురుస్తున్నప్పుడు ఒక​ గొడుగును గట్టిగా పట్టుకొని దాని కింద ఉన్న వారందరిని కాపాడుతున్నట్లు ఒక యానిమేటెడ్‌ పోస్టర్‌ని కేరళకు చెందిన ఆశిన్‌మున్ను అనే ఆర్టిస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ యానిమేటెడ్ పోస్ట్ రాజకీయంగా వివిధ మలుపులు తిరుగుతోంది.
 
ఈ పోస్టులో చిన్నపిల్లలు, కరోనా పేషెంట్స్‌, ముసలివాళ్లు, డాక్టర్లు, పోలీసులు అందరూ ఉన్నారు. వారందరిని కేరళ ప్రభుత్వం కాపాడుతుందనే ఉద్దేశంతో ఆ మీమ్‌ని తయారు చేశాడు. అయితే దీనిని ఏప్రిల్‌ 17న మున్ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీనిని చూసిన కేరళకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒ.రాజగోపాల్‌ ఇదే పోస్టర్‌ని కొన్ని మార్పులతో ఆయన అఫిషియల్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 
 
పినరయి విజయన్‌ పైన ప్రధాని మోదీ ఇంకో పెద్దగొడుగుతో అందరిని కాపాడుతున్నట్లుగా ఉన్న మీమ్‌ని ఆయన షేర్‌ చేశారు. ఇలా చేసినందుకు చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేని ట్రోల్‌ చేశారు. తరువాత ఎవరికి తగ్గట్టుగా వారు దాన్ని మార్చుకుంటూ పోస్ట్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments