బాలాజీ జిల్లా కాదు తిరుపతి జిల్లా, నగరి బాలాజీ జిల్లాలోనే, సీఎంను కలుస్తా: రోజా

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (19:16 IST)
జిల్లాల పునర్విభజనపై కొంతమంది అనవసరంగా ఆందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. కొత్త జిల్లాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఎవరైనా సరే మార్చి 2వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం ఉంటుందన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో ప్రధానంగా నగరి నియోజకవర్గం కొంత బాలాజీ జిల్లాలో, కొంత చిత్తూరు జిల్లాలో ఉండటం వల్ల నగరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 

 
కాబట్టి త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని చెప్పారు రోజా. బాలాజీ జిల్లాలోనే నగరి నియోజకవర్గాన్ని ఉంచాలని సిఎంను కోరుతానన్నారు. చిత్తూరు చాలాదూరం అయిపోతుందని.. తిరుపతి నగరికి చాలా దగ్గరగా ఉంటుందని రోజా చెప్పుకొచ్చారు. 

 
తిరుపతిని తిరుపతి జిల్లాగానే కొనసాగించాలన్న డిమాండ్ కూడా వినబడుతోందని.. ఇందుకు ఒకే ఒక్క అవకాశం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సిఎంను కలిస్తే సరిపోతుందన్నారు. మన సమస్యను మనమే సిఎం దృష్టికి తీసుకెళితే ఖచ్చితంగా ఆయన స్పందిస్తారని ఈ సంధర్భంగా రోజా చెప్పారు. 
 
గత రెండేళ్ళుగా తిరుపతి గంగమ్మ జాతర జరగలేదని.. ఈసారి ఖచ్చితంగా జాతర జరుగుతుందని.. రాయలసీమ ప్రజల ఇలవేల్పు గంగమ్మ తల్లి జాతరకు ముందు ఆలయాన్ని సందర్సించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రోజా. కుటుంబ సమేతంగా తిరుపతి గంగమ్మను రోజా దర్సించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments