Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కారుకు.. అందులోని డబ్బుకు పార్టీకి నాకు సంబంధం లేదు : మంత్రి బాలినేని

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:29 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఎళావూరు వద్ద రూ.5 కోట్లతో పట్టుబడిన కారుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కారుకు, అందులోని డబ్బుకు పార్టీకి గానీ నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. పైగా, తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు. 
 
ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళుతూ, చెన్నై సమీపంలో పట్టుబడిన ఓ కారులో రూ.5 కోట్ల నగదుతో పాటు.. బంగారాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ ఉంది. దీంతో ఈ కారులో ఉన్నది వైకాపా అక్రమ సంపాదన అని, ఆ నగదును పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments