Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కారుకు.. అందులోని డబ్బుకు పార్టీకి నాకు సంబంధం లేదు : మంత్రి బాలినేని

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:29 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఎళావూరు వద్ద రూ.5 కోట్లతో పట్టుబడిన కారుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కారుకు, అందులోని డబ్బుకు పార్టీకి గానీ నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. పైగా, తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు. 
 
ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళుతూ, చెన్నై సమీపంలో పట్టుబడిన ఓ కారులో రూ.5 కోట్ల నగదుతో పాటు.. బంగారాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ ఉంది. దీంతో ఈ కారులో ఉన్నది వైకాపా అక్రమ సంపాదన అని, ఆ నగదును పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments