Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మీడియా ప్రతినిధి రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: వేణు స్వామి ఆరోపణ (Video)

ఐవీఆర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (22:02 IST)
వివాదాస్పద జ్యోతిష్కుడుగా పేరుకెక్కిన వేణు స్వామి ప్రముఖ మీడియా ప్రతినిధి పైన సంచలన ఆరోపణలు చేసారు. తనను రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఓ ఆడియోతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పోస్టులో ఓ మహిళ అవతలి వ్యక్తితో వేణు స్వామి అంత ఇచ్చుకోలేరంటూ చెబుతున్నారు. అవతలి వ్యక్తి పేరు జూనియర్ జర్నలిస్ట్ అమర్ అని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా డబ్బు డిమాండుపై సాగింది. ఓ జ్యోతిష్యుడిని రూ. 5 కోట్లు డిమాండ్ చేయడం ఏంటనీ, తమను బ్లాక్ మెయిల్ చేస్తూ నిద్రలేని రాత్రులకు గురి చేస్తున్నారంటూ వేణు స్వామి దంపతులు ఆవేదన వ్యక్తం చేసారు.
 
ఈ వేధింపులు తాళలేక తాము గత కొన్నిరోజులుగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయామనీ, తాము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు కూడా ఆ వీడియోలో వారు తెలిపారు. ఈ వీడియోను చూసిన తర్వాత తమను లాయర్లు కాపాడుతారో, పోలీసులు కాపాడుతారో, జర్నలిస్టులు కాపాడుతారో తెలియదనీ, తమకు న్యాయం జరిగితే ఇంకా తమ వద్ద వున్న సాక్ష్యాలను బయటపెడతామంటూ చెప్పారు వేణుస్వామి సతీమణి. ఈ వీడియోలో చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments