ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (20:20 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ఆయనను ఆదివారం మరోమారు విచారణకు పిలిచిన సీబీఐ.. ఏకంగా ఎనిమిది గంటల పాటు విచారణ జరిపింది. ఈ విచారణ తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్య పాలసీ ఖరారు చేయడం వెనుక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరగడానికి మార్గం సుగమమం చేశారని సిసోడియాపై సీబీఐ ఆరోపణలు చేసింది. దీంతో ఈ కేసులో తనను అరెస్టు చేస్తారని సిసోడియా ఆదివారం ఉదయం ప్రకటించారు. పైగా, జైలుకు వెళ్లేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
ఆయన చెప్పినట్టుగా ఆదివారం విచారణకు పిలిచిన సీబీఐ ఆయన్ను అరెస్టు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.  సిసోడియా విచారణ, అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేశారు. 
 
ఇదిలావుంటే సిసోడియా అరెస్టుపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. "దేవుడు నీకు అండగా ఉంటాడు మనీశ్.. రాష్ట్రంలోని లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల దీవెనలు నీకు లభిస్తాయి. ఒక వేళ నువ్వుజైలుకు వెళ్లాల్సి వస్తే అది నీ దేశం కోసం, నీ సమాజం కోసమే జైలుకు వెళుతున్నట్టు అవుతుంది. జైలుకు వెళ్లడం శాపమేమీ కాదు. నీ వంటి మంచి వ్యక్తులకు అది శోభనిస్తుంది. త్వరలోనే జైలు నుంచి తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. మేమందరం నీకోసం ఎదురు చూస్తుంటాము" అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments