Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ నాన్ వెజ్ థాలీ.. చనిపోయిన బొద్దింకను చూసి?

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (20:08 IST)
Cockroach
జబల్‌పూర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సదరు ప్రయాణికుడు తన ఆహారంలో చనిపోయిన బొద్దింకను చూసి షాకయ్యాడు. ఆహారంలో బొద్దింకను చూసి చాలా బాధపడ్డానని సోషల్ మీడియాలో తెలిపాడు. ఇంకా ఆహారంలో బొద్దింక గల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 
 
జబల్‌పూర్ రైలు స్టేషన్‌లో దిగిన తర్వాత అతను పశ్చిమ మధ్య రైల్వేకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి రెండు రోజుల తర్వాత ఎక్స్‌లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను షేర్ చేశాడు. ఈ ట్వీట్‌కు ప్రతిస్పందనగా, ఐఆర్‌సీటీసీ క్షమాపణలు కోరింది. 
 
"నేను 1/02/2024 రైలు నెం. 20173 ఆర్కేఎంపీ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాను. వారు ఇచ్చిన ఆహార ప్యాకెట్‌లో చనిపోయిన బొద్దింకను చూసి నేను బాధపడ్డాను" అని డాక్టర్ శుభేందు కేశరి ఎక్స్‌లో కొన్ని చిత్రాలను పంచుకుంటూ రాశారు.
 
అతను తన ఫిర్యాదులో సాక్షిగా రాజేష్ శ్రీవాస్తవ అనే మరో ప్రయాణికుడిని చేర్చుకున్నాడు. అతను ఆర్డర్ చేసిన నాన్ వెజిటేరియన్ థాలీలో చనిపోయిన బొద్దింక మిగిలిన ఫోటోలలో కనిపిస్తుంది. దీనిపై ఐఆర్టీటీసీ సానుకూలంగా స్పందించింది. ఇంకా క్యాటరింగ్ సర్వీస్ తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments