Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడో కాల్ చేశాడు.. పిల్లాడు యాప్ ఇన్‌స్టాల్ చేశాడు.. అంతే రూ.9లక్షలు స్వాహా!

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (16:27 IST)
కరోనా వైరస్ కారణంగా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో ఆన్‌లైన్ క్లాసులు, గేములు అంటూ పిల్లలు స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. దీంతోపాటు ఫోన్‌లలో కొత్త కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం.. యాప్‌లను డౌన్లోడ్ చేయడం చేస్తున్నారు. తాజాగా గుర్తు తెలియని కాలర్ నుంచి వచ్చిన సూచనల మేరకు ఒక పిల్లాడు ఫోన్‌లో ఇంస్టాల్ చేసిన యాప్ తండ్రి కొంపముంచింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి 15 ఏళ్ల కుమారుడు తండ్రి ఫోన్ వాడుతున్నాడు. అతనికి తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను డిజిటల్ చెల్లింపు సంస్థకు చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌‌గా పరిచయం చేసుకున్నాడు.
 
మొబైల్ ఫోన్‌‌ను మాన్వాట్ బ్యాంక్ ఖాతాతో అనుసంధానిస్తున్నామని, తన తండ్రి డిజిటల్ చెల్లింపు ఖాతా క్రెడిట్ పరిమితిని పెంచే అప్లికేషన్‌‌ను ఇన్‌స్టాల్ చేయమని కాలర్ బాలుడిని కోరాడు. ఆ తర్వాత రూ.9 లక్షలు డ్రా చేసుకున్నాడు. నిందితుడికి మొబైల్ ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ రావడం, డబ్బు మాయం కావడం క్షణాల్లో జరిగాయి. ఇలాంటి మోసాలు జరగకుండా వుండాలంటే.. పరిచయం లేని యాప్‌లకు.. గుర్తు తెలియని కాల్స్‌కు దూరంగా వుండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments