Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాజ్‌కు బీజేపీ పగ్గాలు.. గడ్కరీకి ఉప ప్రధాని పదవి : బీజేపీ నేత లేఖ

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (14:01 IST)
భారతీయ జనతా పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పుల గురించి కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత సంఘ్ ప్రియా గౌతమ్ రాసిన లేఖ ఇపుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీని దేశ ఉప ప్రధానమంత్రిగా నియమించాలని ఆయన కోరారు. అంతేకాకుండా, కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన తన లేఖలో కోరారు. 
 
అలాగే, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా రాజ్యసభపై ఎక్కువ దృష్టి సారించాలని, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను భాజపా అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని కోరారు. 88 ఏళ్ల సంఘ్‌ ప్రియా... అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హాయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
 
ఇప్పటివరకూ చక్రం తిప్పిన అగ్ర రాజకీయ నాయకులందరిలో మోడీ కూడా ఉంటారని, ఆయన హవా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కొన్ని మినహా ఎక్కువ రాష్ట్రాల్లో భాజపానే విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments