ప్రియతమ నేత ప్రశాంతంగా సాగునంపుదాం.. స్టాలిన్ పిలుపు

డీఎంకే అధినేత కరుణానిధి ఇకలేరు. ఆయన మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకేస్టాలిన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (21:54 IST)
డీఎంకే అధినేత కరుణానిధి ఇకలేరు. ఆయన మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకేస్టాలిన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
 
ద్రవిడ సూర్యుడు ఇకలేరు. మన ప్రియతమ నేతను ప్రశాంతంగా సాగనంపుదాం.. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి భావోద్వోగాలకు గురికావద్దని కోరారు.
 
తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కన్నుమూయడంతో స్టాలిన్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంత విచారంలోనూ ఆయన మీడియా ముందుకు వచ్చి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, మన ప్రియతమ నేత పట్ల గౌరవం చాటుకునే సమయమిదని సూచించారు.
 
ఇదిలావుంటే, కరుణానిధి మరణవార్త తెలిసిన తర్వాత తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్ఆర్‌టీసీ బస్సుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక జిల్లాల ఎస్పీలను కుమారస్వామి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments