Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన పోలింగ్ : హుజూర్ నగర్‌లో ఓటర్ల మూడ్ ఏంటి?

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (17:42 IST)
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే, ఐదు గంటల లోపు వచ్చి వరుసలో నిలబడినవారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పోలింగ్ అధికారులు వెల్లడించారు. 
 
మరోవైపు,పోలింగ్ ముగిసే సమయానికి హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల 80 శాతానికి పైగా నమోదైంది. మొత్తం నియోజకవర్గంలో 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటన్నిటిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే లైన్‌లో నిలబడి ఉన్నవారంతా ఓటు హక్కు వినియోగించుకుంటే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. ఇక 2014లో 81.14 శాతం, 2018లో 85.96 శాతం ఓటింగ్ నమోదైంది. తాజాగా ఈ ఉపఎన్నికలో కూడా అంతే స్ధాయిలో నమోదయ్యే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. పైగా, ఈ అసెంబ్లీ స్థానం ఓటర్ల మూడ్ మాత్రం విపక్ష పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. 
 
మరోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానానికి ఉన్న 288 సీట్లతో పాటు.. హర్యానాలోని 90 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా, మహారాష్ట్రలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బాలీవుడ్ సెలెబ్రిటీలు, ప్రముఖులు క్యూకట్టారు. పైగా, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రధాని మోడీతో పాటు.. పార్టీ చీఫ్ అమిత్ షాలు సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments