పెళ్లి పీటల మీద ల్యాప్‌టాప్‌తో వర్క్ చేస్తున్న వరుడు - ఫోటో వైరల్

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (10:00 IST)
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని ఐటీ ఉద్యోగులు తమ గృహాల నుంచి పని చేసే వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ వర్క్ ఫ్రమ్ కొందరికి అనుకూలంగాను, మరికొందరికి ప్రాణ సంకటంగా మారింది. పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ పేరుతో ఉద్యోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు. రేయింబవుళ్లు వర్క్ చేయించుకుంటున్నాయి. 
 
దీనికి నిదర్శనమే ఓ వరుడు పెళ్లి పీటల మీద కూర్చొని కూడా ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతూ వర్క్ ఫ్రమ్ హోం విధులు నిర్వహిస్తున్నాడు. ఒకవైపు పురోహితుడు వేద మంత్రాలు చదువుతుంటే మరోవైపు వరుడు ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ నిమగ్నమైపోయాడు. దీనికి సంబంధించిన పోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
పై ఫోటోలో కనిపిస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ యువకుడు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తూనే, మరోవైపు పెళ్లినాటి ప్రమాణాలు ఆచరిస్తుండటం సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనిపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. 
 
వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతిని మరో లెవల్‌కు తీసుకెళ్లిపోయాడని కొందరు అంటుంటే... ఉద్యోగాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమతూకం చేసుకోవాలో ఈ యువకుడు నేర్చుకోవాలని మరికొందరు సూచన చేస్తున్నారు. పెళ్లి రోజున కూడా ఆ యువకుడిని ఆనందంగా ఉండనివ్వరా అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments