కేరళ సీరియల్ ఉమెన్ కిల్లర్ : చలాకీ మాటలతో మభ్యపెట్టి మట్టుబెట్టింది...

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (12:59 IST)
కేరళ సీరియల్ ఉమెన్ కిల్లర్ జాలీ కథ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 14 యేళ్లలో ఆరుగురిని హత్య చేసిన ఈ మహిళ పైకి చలాకీగా నవ్వుతూ, మాయమాటలతో మభ్యబెట్టి మట్టుబెట్టినట్టు తేలింది. ఆమె గురించి ఆసక్తికరమైన వరుస కథనాలు వస్తున్నాయి. 
 
ఈ సైకో ఉమెన్ కిల్లర్‌పై కేసును విచారిస్తున్న డీజీపీ లోక్‌నాథ్ బెహరా మాట్లాడుతూ, జాలీ... పైకి చలాకీగా నవ్వుతూ కనిపిస్తూ, అందరితోనూ చక్కగా మాట్లాడేదని చెప్పారు. మంచి గృహిణిగా పేరు తెచ్చుకుందని తెలిపారు.
 
అయితే, ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమేనని, మరో వైపు చూస్తే, 14 ఏళ్లలో ఆరుగురిని హత్య చేసిందని తెలిపారు. జాలీలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని భావిస్తున్నామని, ఒక్కో సమయంలో సైకోగా మారే ఆమె, తినే ఆహారంలో సైనైడ్ కలుపుతూ ఒక్కొక్కరినీ మట్టుబెట్టిందన్నారు. 
 
అందుకే ఆమెకు సైకో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించనున్నామని లోక్‌నాథ్ తెలిపారు. ఈ కేసు పోలీసులకు చాలా సంక్లిష్టమైనదని, విచారణకు మంచి సైకాలజిస్టుల సాయం తప్పనిసరిగా తీసుకుంటామన్నారు. 
 
అయితే, జాలీ బంధువులు మాత్రం, ఆమె అమాయకురాలని చెబుతుండటం గమనార్హం. ఆమెను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జాలీ స్నేహితులు కూడా ఆమె వరుస హత్యలు చేసిందంటే నమ్మలేకున్నామని చెప్పడం ఇపుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. తన భర్త మరిదిపై మోజుపడిన జాలీ... భర్తతో పాటు.. మొత్తం ఆరుగుని హతమార్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments