#WhereisKCR ట్రోలింగ్.. కేసీఆర్ ఇన్ ప్రగతి భవన్.. (video)

Webdunia
శనివారం, 11 జులై 2020 (17:41 IST)
#WhereisKCR పేరుతో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ అంటూ విపక్షాలు నానా హంగామా చేశాయి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతుంటే.. అసలు ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించాల్సిన అవసరం ఏముందంటూ ఏకంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. 
 
ఇక మంత్రి కేటీఆర్ కూడా మీడియా, నెటిజన్లు కరోనా నుంచి కోలుకున్న వారి వివరాలు చెప్పకుండా, ఓ వీడియోను పట్టుకుని రచ్చ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు బీభత్సంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూడా లేకుండా ఫాం హస్‌కు వెళ్లిపోవడం, ప్రజలకు కూడా కనిపించకపోవడం మీద సామాన్యుల నుంచి విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ సుమారు రెండు వారాలుగా ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌లో ఉన్నారు. ఆయన త్వరలో రైతులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments