Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వాస పరీక్షను ప్రవేశపెట్టిన యడ్యూరప్ప.. రాజీనామా లేఖ సిద్ధం?

కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆ రాష్ట్ర శాసనసభలో విశ్వాస పరీక్షను ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని

Webdunia
శనివారం, 19 మే 2018 (15:56 IST)
కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆ రాష్ట్ర శాసనసభలో విశ్వాస పరీక్షను ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన విశ్వాస పరీక్షలో ఓడిపోతామన్న నిర్ణయానికి వచ్చి రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని తన ప్యాకెట్‌లో పెట్టుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది.
 
అంతకుముందు శనివారం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర శాసనసభ ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత భోజన విరామ సమయం ప్రకటించారు. పిమ్మట మధ్యాహ్నం 3.30 గంటలకు కొలువుదీరిన తీరిన తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఈ ప్రమాణ స్వీకారాల తంతు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప ప్రసంగం తర్వాత యడ్యూరప్ప గవర్నర్ వజూభాయ్ వాలాతో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పిస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments