మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (14:54 IST)
కర్ణాటక రాష్ట్రంలో మైనింగ్ కింగ్‌, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని లంచం కేసులో సీసీబీ ఆదివారం అరెస్టు చేసింది. అంబిడెంట్ కంపెనీ గ్రూపుకు సంబంధించిన రూ.18 కోట్ల లంచం కేసులో గాలి జనార్థన్‌ను విచారించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. 
 
గత మూడు రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన జనార్థన్ రెడ్డి.. శనివారం తన న్యాయవాదితో కలిసి సీసీబీ ఎదుట విచారణ‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డికి సీసీబీ పోలీసులు ఆదివారం విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన శనివారమే హాజరయ్యారు. 
 
శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు విచారించిన సీసీబీ అధికారులు అనంతరం అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన్ను విక్టోరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. 
 
ఆ తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుపై సీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. 'విశ్వసనీయ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా గాలి జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. కోర్టు ఎదుట గాలి జనార్థన్‌ను హాజరుపరుస్తాం. ఆయన్ను విచారించేందుకు సీసీబీ కస్టడీకి పంపాలని కోర్టుకు విన్నవిస్తాం. అంబెడెంట్ గ్రూపు కాజేసిన సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం. ఆ సొమ్మును బాధితులకు అందజేస్తాం' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments