Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (14:54 IST)
కర్ణాటక రాష్ట్రంలో మైనింగ్ కింగ్‌, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని లంచం కేసులో సీసీబీ ఆదివారం అరెస్టు చేసింది. అంబిడెంట్ కంపెనీ గ్రూపుకు సంబంధించిన రూ.18 కోట్ల లంచం కేసులో గాలి జనార్థన్‌ను విచారించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. 
 
గత మూడు రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన జనార్థన్ రెడ్డి.. శనివారం తన న్యాయవాదితో కలిసి సీసీబీ ఎదుట విచారణ‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డికి సీసీబీ పోలీసులు ఆదివారం విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన శనివారమే హాజరయ్యారు. 
 
శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు విచారించిన సీసీబీ అధికారులు అనంతరం అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన్ను విక్టోరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. 
 
ఆ తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుపై సీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. 'విశ్వసనీయ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా గాలి జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. కోర్టు ఎదుట గాలి జనార్థన్‌ను హాజరుపరుస్తాం. ఆయన్ను విచారించేందుకు సీసీబీ కస్టడీకి పంపాలని కోర్టుకు విన్నవిస్తాం. అంబెడెంట్ గ్రూపు కాజేసిన సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం. ఆ సొమ్మును బాధితులకు అందజేస్తాం' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments