Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్: కర్ణాటక ఎన్నికల పోలింగ్.. బీజేపీ నేతల పూజలు.. అమిత్ షా కూడా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలు పూజలు చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం సాధించడం కోసం బీజేపీ నేతలంతా తమదైన శైలిలో గోపూజలు చేస్తూ.. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భా

Webdunia
శనివారం, 12 మే 2018 (10:25 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలు పూజలు చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం సాధించడం కోసం బీజేపీ నేతలంతా తమదైన శైలిలో గోపూజలు చేస్తూ.. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప ఇంట్లో పూజలు నిర్వహించి ఆపై ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని కోరుతూ గురువానంద గురూజీ ఆశీర్వాదాన్ని అమిత్ షా పొందినట్టు జాతీయ మీడియా కోడైకూస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమాన్ని అమిత్ షా తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించారు.
 
అంతకుముందు, ఆశ్రమంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని సందర్శించుకుని.. స్వామివారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, ఆశ్రమ పీఠాధిపతి గురువానంద గురూజీని కలిసేందుకు అమిత్ షా తన కుమారుడు, కోడలుతో కలిసి వెళ్లారు. సుమారు నలభై నిమిషాల పాటు గురూజీ వద్ద అమిత్ షా గడిపినట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం గురూజీ ఆశీర్వాదం పొందినట్టు ఆశ్రమ వర్గాల సమాచారం.
 
అలాగే జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి కుమారస్వామి జయానగర్‌లోని ఆదిచుంచనాగిరి మహాస్థాన మఠంలో నిర్మలానందానంత మహాస్వామిని కలిశారు. ఆయన ఆశీర్వాదం పొందారు. అలాగే బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఉపముఖ్యమంత్రి అభ్యర్థి బి.శ్రీరాములు.. తన ఓటు హక్కు వినియోగించుకునేముందు గోవు పూజ చేశారు.
 
మరోవైపు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. హసన్ జిల్లా హొళెనరసిపురలో దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మలు తమ ఓట్లు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments